IED Recovered | ఛత్తీస్గఢ్లో మరోసారి భారీ విధ్వంసానికి మావోయిస్టులు ప్లాన్ చేయగా.. భద్రతా బలగాలు దాన్ని భగ్నం చేశాయి. రోడ్డుకు ఐదు అడుగల కింద నక్సల్స్ ఏర్పాటు చేసిన భారీ ఐఈడీని రికవరీ చేశారు. ఐఈడీ 50 కిలోల వరకు ఉంటుందని భద్రతా బలగాలు తెలిపాయి. పేలుడు జరిగి ఉంటే పెను నష్టమే జరిగి ఉండేది. ఏప్రిల్ 26న దంతెవాడలోని అరన్పూర్లో ఇదే తరహాలో పేలుడుకు పాల్పడిన విషయం తెలిసిందే. అందులో సైతం 50 కిలోల ఐఈడీని ఉపయోగించారు. ఈ దాడిలో పది మంది జవాన్లు వీరమరణం పొందారు.
సీఆర్పీఎఫ్ 168తో పాటు 222 బెటాలియన్ సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి.. అవపల్లి -బాసగూడ రోడ్డులోని దుర్గ గుడి సమయంలో ఈఐడీ స్వాధీనం చేసుకున్నారు. మావోలు మార్గం మధ్యలో ఎనిమిది అడుగుల పొడువు, ఐదు అడుగుల లోతులో గుంతను తవ్వి, రెండు ప్లాస్టిక్ బకెట్లలో 25 కిలోల చొప్పున ఐఈడీని అమర్చారు. ఐఈడీ స్వాధీనం చేసుకున్న బలగాలు వాటి.. నిర్వీర్యం చేశారు. ఇదిలా ఉండగా.. ఛత్తీస్గఢ్ – తెలంగాణ సరిహద్దుల్లో ఇటీవల ట్రాక్టర్లో తరలిస్తుండగా పట్టుకున్నారు. అలాగే పది మందిని అరెస్టు చేశారు. పెద్ద మొత్తంలో మావోయిస్టులకు చేరవేస్తుండగా పట్టుకున్నారు.