న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: రాష్ట్రపతిని ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’గా పేర్కొడంపై బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, భారత మాజీ స్టార్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ మద్దతు పలికారు. ‘భారత్ మాతాకీ జై’ అంటూ అమితాబ్ ట్వీట్ చేశారు. మాజీ క్రికెటర్ సెహ్వాగ్ కూడా పేరు మార్పు అంశాన్ని స్వాగతించారు. ఇండియా అనేది బ్రిటీషర్లు పెట్టిన పేరు అని పేర్కొన్నారు. ‘మనమంతా భారతీయులం. దేశానికి అధికారికంగా అసలు పేరు తిరిగి రావడానికి చాలా కాలం గడిచిపోయింది’ అని ఎక్స్లో ట్వీట్ చేశారు. వచ్చే ప్రపంచ కప్లో భారత క్రికెటర్ల జెర్సీలపై భారత్ పేరును ముద్రించాలని బీసీసీఐని కోరారు.