న్యూఢిల్లీ, డిసెంబర్ 12: వచ్చే ఏడాది జనవరిలో భారత్లో జరిగే గణతంత్ర వేడుకలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ముఖ్య అతిథిగా హాజరు కావడం లేదు. బైడెన్ జనవరిలో భారత్కు రావడం లేదని వాషింగ్టన్ వర్గాలు ఇప్పటికే భారత్కు సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. అమెరికా అధ్యక్షుడిగా తిరిగి ఎన్నిక, హమాస్-ఇజ్రాయిల్ సంక్షో భం తదితర అంశాలపై బైడెన్ దృష్టి సారించినందున ఆయన జనవరిలో భారత్ వచ్చే అవకాశాలు లేవని ఆ దేశ వర్గాలు తెలిపాయి. కాగా, భారత్ ఆతిథ్యం ఇస్తున్న క్వాడ్ సమ్మిట్ను 2024 జనవరిలో నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. ప్రస్తుతం పరిశీలించిన తేదీలు అన్ని క్వాడ్ భాగస్వామి దేశాలతో సరిపోలనందున, తర్వాత నిర్వహించాలని యోచిస్తున్నట్టు ఒక ఉన్నతాధికారి తెలిపారు.