రాయ్పూర్ : రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించిన తర్వాతే కేంద్ర పధకాలకు పేర్లను ఖరారు చేయాలని చత్తీస్ఘఢ్ సీఎం భూపేష్ బాఘేల్ (Bhupesh Baghel) కేంద్రాన్ని డిమాండ్ చేశారు. గతంలో పలు పధకాలకు కేంద్రమే పూర్తిస్ధాయిలో నిధులు సమకూర్చేదని ఆపై కేంద్రం 90 శాతం, రాష్ట్రాలు 10 శాతం నిధులను సమకూర్చేవని సీఎం పేర్కొన్నారు.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం 50 శాతం నిధులు ఇస్తుండగా రాష్ట్రాలు 50 శాతం నిధులను ఆయా పధకాలకు కేటాయిస్తున్నాయని తెలిపారు. పధకాలకు కేంద్రం, రాష్ట్రాలు సమానంగా నిధులు భరిస్తుండగా ఆయా పధకాలకు కేంద్ర ప్రభుత్వమే ఎందుకు పేర్లను నిర్ణయిస్తోందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు చేపట్టిన తర్వాతే పధకాలకు పేర్లను ఖరారు చేయాలని కేంద్రాన్ని ఆయన డిమాండ్ చేశారు.
Read More
Ashish Vidyarthi | 60 ఏండ్ల వయసులో ఆశీష్ విద్యార్థి రెండో పెళ్లి .. వధువు బ్యాక్గ్రౌండ్ ఇదే !