భువనేశ్వర్: ఒడిశా అసెంబ్లీ ముట్టడికి భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) కార్యకర్తలు గురువారం యత్నించారు. టీచర్ మమితా మెహర్ హత్య కేసులో ఆరోపణలున్న హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి దిబ్యా శంకర్ మిశ్రాను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కాగా, ఒడిశా అసెంబ్లీ వైపు వస్తున్న బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. లాఠీచార్జ్ చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఒడిశా అసెంబ్లీ సమావేశాలను మమితా మెహర్ హత్య కేసు కుదిపేస్తున్నది.