Aravind kejriwal | దేశంలో మరో కొత్త పొత్తు పొడిచేందుకు సిద్ధమైంది. రైతుల్లోని ఓ వర్గం సంయుక్త కిసాన్ మోర్చాగా ఆవిర్భవించింది. భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు బలవీర్ సింగ్ రాజేవాలా సంయుక్త కిసాన్ మోర్చా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నికయ్యారు. దాదాపు 32 రైతు సంఘాలతో ఉన్న ఈ సంయుక్త కిసాన్ మోర్చా కీలక సమావేశం శనివారం చండీగఢ్లోని సెక్టార్ 36 లో జరిగింది. ఈ సమావేశంలోనే పంజాబ్ సీఎం అభ్యర్థిగా బలవీర్ సింగ్ రాజేవాలాను ప్రకటించింది కిసాన్ మోర్చా.
అంతేకాకుండా ఆమ్ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని కూడా దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 38 రైతు సంఘాల్లో 28 రైతు సంఘాలు కేజ్రీవాల్తో పొత్తు పెట్టుకోవడానికి ఒకే చెప్పినట్లు సమాచారం. అయితే మొదటగా పంజాబ్లో 40 స్థానాల్లో ఒంటరిగానే బరిలోకి దిగాలని ఈ సంయుక్త కిసాన్ మోర్చా ఓ నిర్ణయానికి వచ్చింది. చర్చల మీద చర్చలు సాగిన తర్వాత, అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకోవాలన్న నిర్ణయానికి వచ్చిందని తెలుస్తోంది.