న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని అధికార ఆప్ ప్రభుత్వం కోరినంతగా కొవాగ్జిన్ సరఫరాకు భారత్ బయోటెక్ నిరాకరించింది. ఉత్పత్తి, డిమాండ్ మధ్య వ్యత్యాసాలతోపాటు ప్రభుత్వ కారణాలను కూడా పేర్కొన్నది. ఈ మేరకు ఆ సంస్థ రాసిన లేఖను ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బుధవారం ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం పేరుతో ఢిల్లీకి కోవాక్సిన్ సరఫరా చేయడం లేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో 17 స్కూల్స్లో ఏర్పాటు చేసిన వంద కొవాగ్జిన్ టీకా కేంద్రాలను బలవంతంగా మూసివేయాల్సి వచ్చిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మార్చి నెలాఖరు వరకు 76 దేశాలకు 6.6 మిలియన్ డోసుల కోవిడ్ వ్యాక్సిన్ను పంపిందని, ఇది అది పెద్ద తప్పు అని సిసోడియా ఆరోపించారు.