న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: భారత సైన్యం శిక్షణలో కౌటిల్యుడి అర్థశాస్త్రం, భగవద్గీతలు కూడా భాగం కానున్నాయి. మిలిటరీ శిక్షణ కరిక్యులంలో అర్థశాస్త్రం, భగవద్గీత, మహాభారతం లాంటి పురాతన భారతీయ గ్రంథాలను చేర్చాలని కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్(సీడీఎం) నిర్వహించిన అంతర్గత అధ్యయనం సూచించింది. వ్యూహాత్మక ఆలోచన విధానం, నాయకత్వ లక్షణాలు, యుద్ధ నీతిని అర్థం చేసుకోవడంలో ఇవి బాగా దోహదపడుతాయని పేర్కొన్నది. మనుస్మృతి, నీతిసారంపై వర్క్ షాప్లు, సెమినార్లు నిర్వహించాలని సూచించింది.