పంజాబ్ ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ సింగ్ ఆప్ శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యారు. పంజాబ్ ఎన్నికల్లో బంపర్ విక్టరీ సాధించిన నేపథ్యంలో ఆప్ శాసనసభా పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలందరూ భగవంత్ మాన్ను శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నుకున్నారు. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ భగవంత్ మాన్ శనివారం గవర్నర్తో భేటీ కానున్నారు.
ఈ సందర్భంగా భగవంత్ మాన్ మాట్లాడుతూ… ‘ఎమ్మెల్యేలందరూ తమ తమ నియోజకవర్గాల్లోనే ఉండాలని, అంతేగానీ పార్టీ ఆఫీసులోనే వుండొద్దని, రాజధానిలోనే మకాం వేయవద్దని హుకూం జారీ చేశారు. అంతేకాకుండా మంత్రివర్గంలో చోటు కోసం కూడా ఉబలాటపడొద్దని తేల్చి చెప్పారు. మన మన నియోజకవర్గాల్లో పనిచేయాలి. మనపై నమ్మకం ఉంచిన వారి కోసం పనిచేయాలి. మన మన నియోజకవర్గాల్లోనే నిత్యం ఉండాలి. కేవలం చండీగఢ్లోనే ఉండొద్దు’ అంటూ భగవంత్ మాన్ ఎమ్మెల్యేలకు సూచించారు. ప్రస్తుతం 17 మంది మంత్రులతో ఉన్న కేబినెట్ వుందని, ఎవ్వరూ నిరాశ చెందవద్దని విజ్ఞప్తి చేశారు. అందరూ కేబినెట్ మంత్రులేనంటూ భగవంత్ మాన్ ఎమ్మెల్యేలతో అన్నారు.