బెంగళూరు: స్నేహితులతో శృంగారంలో పాల్గొనమని ఒక టెక్కీ తన భార్యను బలవంతం చేస్తున్నాడు. మొబైల్ ఫోన్లో ఆ వీడియోలు రికార్డు చేసి ఆపై ఆమెను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. సంపిగేహల్లి ప్రాంతంలో నివసిస్తున్న దంపతులకు 2011లో పెళ్లైంది. వారికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఇద్దరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజినీర్లు. కాగా, తన ఇద్దరు స్నేహితులతో శృంగారంలో పాల్గొవాలని 36 ఏళ్ల వయసున్న భార్యను ఆమె భర్త బలవంతం చేయసాగాడు. ఒప్పుకోకపోతే ఆమెను కొట్టేవాడు. స్నేహితులతో ఆమె లైంగిక చర్యలను మొబైల్ ఫోన్లో రికార్డు చేశాడు.
మరోవైపు భర్త టార్చర్ను భరించలేని భార్య విడాకులు ఇచ్చేందుకు సిద్ధమైంది. అయితే మొబైల్ ఫోన్లో రికార్డు చేసిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ భార్యను భర్త బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మద్యానికి బానిస అయిన తన భర్త డ్రగ్స్ కూడా తీసుకుంటాడని తెలిపింది. లైంగిక వాంఛ తీర్చమని తన సోదరుని కూడా అతడు బలవంతం చేస్తున్నాడని ఆమె ఆరోపించింది. ఆ మహిళ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.