బెంగుళూరు: బెంగుళూరులో భారీ వర్షం కురుస్తోంది. దీంతో నగరంలో లోతట్టు ప్రాంతాలు మునిగిపోతున్నాయి. అనేక ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాలకు విద్యుత్తు సరఫరా ఆగిపోయింది. రాబోయే నాలుగైదు రోజుల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రామీణ, పట్టణ ప్రాంతవాసులకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వర్షం వల్ల ఉపానగర్ ప్రాంతానికి చెందిన ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. పైప్లైన్ వర్క్సైట్ వద్ద ఇద్దరి మృతదేహాలను గుర్తించారు. నగరంలో 155 ఎంఎం వర్షం కురిసినట్లు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రం ప్రారంభమైన వర్షం ఆ తర్వాత తెల్లవారుజాము వరకు కురిసింది. గ్రీన్లైన్లో మెట్రో సేవలను నిలిపివేశారు.