బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరుకు కుక్క మాంసం (dog meat) రవాణా చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్ నుంచి రైలులో వచ్చిన మాంసం శాంపిల్స్ను అధికారులు సేకరించారు. పరీక్ష కోసం ల్యాబ్కు పంపారు. శుక్రవారం సాయంత్రం బెంగళూరులోని కేఎస్ఆర్ రైల్వే స్టేషన్లో గందరగోళం చెలరేగింది. ఒక వ్యాపారి మటన్ ముసుగులో కుక్క మాంసాన్ని సరఫరా చేస్తున్నాడని హిందూత్వ గ్రూపులు విమర్శించాయి. రాజస్థాన్ రాజధాని జైపూర్ నుంచి జైపూర్-మైసూర్ ఎక్స్ప్రెస్లో కుక్క మాంసం డబ్బాలు రవాణా అవుతున్నాయని కొందరు ఆరోపించారు. 90 మాంసం పార్సిల్స్ను వాహనంలోకి లోడ్ చేయడాన్ని అడ్డుకున్నారు.
Dog Meet
కాగా, రైలులో పార్సిల్ ద్వారా రవాణా అయిన మాంసం మటన్ అని ఆ వ్యాపారి తెలిపాడు. తాను గత 12 ఏళ్లుగా ఈ వ్యాపారం చేస్తున్నట్లు చెప్పాడు. అయితే ఆ మాంసం పార్సిల్స్పై రైల్వే స్టేషన్లో గందరగోళం చెలరేగింది. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు అక్కడకు చేరుకున్నారు. మాంసం నమూనాలను సేకరించారు. ఏ జంతువు మాంసాన్ని రవాణా చేస్తున్నారో అన్నది గుర్తించేందుకు శాంపిల్స్ను ల్యాబ్కు పంపారు. మటన్ కాకుండా ఇతర జంతువుల మాంసంగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.