బెంగుళూరు: బెంగుళూరులో ఓ వ్యక్తి ఫైఓవర్ మీద నుంచి కింద కరెన్సీ నోట్లను విసిరేశాడు. దీంతో అక్కడ కొంచం సేపు ట్రాఫిక్ స్తంభించిపోయింది. నగరంలోని బిజీ మార్కెట్ వద్ద ఉన్న బ్రిడ్జ్ మీద నుంచి అతను ఆ కరెన్సీని వెదజల్లాడు. ఆ వ్యక్తి నోట్లు విసిరేస్తున్న సమయంలో కొందరు వీడియోలు తీశారు. కొందరు అతని వద్దకు వెళ్లి డబ్బు తమకు ఇవ్వాలంటూ వేడుకున్నారు.
కేఆర్ మార్కెట్ వద్ద ఉన్న ఫ్లైఓవర్పై ఈ ఘటన జరిగింది. ఫ్లైఓవర్ కింద ఆ కరెన్సీ నోట్లను అందుకునేందుకు భారీ సంఖ్యలో జనం గుమ్మికూడారు. రూ.10 నోట్లను అతను విసిరేసినట్లు తెలుస్తోంది. సుమారు మూడువేల విలువైన నోట్లను అతను పారేశాడు.
బ్రిడ్జ్ మీద నుంచి డబ్బులు విసిరేసిన వ్యక్తి ఎవరు, అతను ఎందుకు అలా చేశాడో ఇంకా ఎవరికీ తెలియదు. పోలీసులు ఆ ప్రాంతానికి వచ్చే లోపు అతను అక్కడ నుంచి పారిపోయాడు. కేసు రిజిస్టర్ చేసిన పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.
An unknown person allegedly threw cash (Rs. 10 notes)from KR Puram flyover in #Bengaluru. There was rush from people to collect the cash. It lead to frenzy. Cops are investigating and trying to identify the person #Karnataka pic.twitter.com/kx8mSxklsR
— Imran Khan (@KeypadGuerilla) January 24, 2023