బెంగుళూరు: కారులో వెళ్తున్న ఓ జంట(Bengaluru Couple) .. కావాలనే ఓ బైకర్ను ఢీకొట్టింది. ఆ ఘటనలో బైకర్ మృతిచెందగా, పిలియన్ రైడర్ గాయపడ్డాడు. ఈ కేసులో బెంగుళూరు పోలీసులు కారులో ఉన్న జంటను అరెస్టు చేశారు. ఈ ఘటనకు చెందిన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. పోలీసుల కథనం ప్రకారం.. అక్టోబర్ 25వ తేదీన రాత్రి 11.30 తర్వాత పుత్తెనహల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఓ యాక్సిడెంట్ జరిగింది. వేగంగా వెళ్తున్న కారు.. ఓ టూవీలర్ను వెనుక నుంచి ఢీకొట్టింది. బైక్ నడుపుతున్న రైడర్ దర్శన్ అక్కడికక్కడే మృతిచెందాడు. అతని స్నేహితుడు వరుణ్ మాత్రం గాయపడ్డాడు. దీన్ని ప్రమాదవశాత్తు మరణంగా జేపీ నగర్ పోలీసులు తొలుత కేసు నమోదు చేశారు.
కానీ సీసీటీవీ ఫూటేజ్ను పరిశీలించిన పోలీసులకు అనుమానం వచ్చింది. కావాలనే బైక్ను ఛేజ్ చేసి ఢీకొట్టినట్లు గుర్తించారు. ఈ ఘటనపై డీఎస్పీ లోకేశ్ జగలాసర్ దర్యాప్తు చేపట్టారు. అయితే విచారణలో కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. టూవీలర్ రైడర్స్ ఈ ఘటనకు ముందు కారును ఢీకొట్టారు. బైక్ను దూకుడుగా నడపడంతో కారుకు చెందిన సైడ్ మిర్ర్ పగిలిపోయింది. దీంతో ఆగ్రహానికి గురైన ఆ కారు డ్రైవర్ తన వాహనాన్ని రివర్స్ చేసి టూవీలర్ను వెంటాడాడు. టూవీలర్ను ఢీకొట్టడంతో దాని రైడర్ అక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు డీసీపీ తెలిపారు. 2 కిలోమీటర్ల దూరం ఛేజ్ చేసినట్లు చెప్పారు.
కారు నడిపిన నిందితుడు ఓ పీఈడీ టీచర్. యాక్సిడెంట్ తర్వాత తన భార్యతో కలిసి ఆ ప్రదేశానికి వచ్చాడు. గుర్తు పట్టకుండా ఉండేందుకు వాళ్లు మాస్క్లు ధరించారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో పడి ఉన్న తమ కార్లకు చెందిన విరిగిన భాగాలను తీసుకెళ్లారు. సాక్ష్యాధారాలు లేకుండా చేయాలన్న ఉద్దేశంతో అలా చేశారు. భారతీయ న్యాయ సంహిత చట్టం కింద పుత్తెనహల్లి పోలీసు స్టేషన్లో ఆ జంటపై కేసు బుక్ చేశారు.
Bengaluru Road Rage Tragedy
A Kalaripayattu trainer & his wife allegedly rammed their car into a delivery agent’s bike after its handle brushed their mirror near JP Nagar killing him on the spot. The pillion rider survived.
pic.twitter.com/uQS5oq0hgo— Nishkama_Karma (@Nishkama_Karma1) October 29, 2025