Bengaluru cafe blast | బెంగళూరు, మార్చి 29: బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కుట్రదారులైన మరో ఇద్దరి ఆచూకీ కోసం ఎన్ఐఏ రూ.20 లక్షల బహుమతిని ప్రకటించింది. ప్రధాన నిందితులైన ముసావీర్ షాజిబ్, అబ్దుల్ మతీన్ అహ్మద్ తాహల సమాచారం తెలిపితే ఒక్కొక్కరిపై 10 లక్షల వంతున 20 లక్షలను బహుమతిగా ఇవ్వనున్నట్టు తెలిపింది.
కేఫ్లో ముసావిర్ హుస్సేన్ షాజిబ్ ఐఈడీని అమర్చాడని పేర్కొంది. సమాచారం తెలిసిన వారు 080-29510900 ఫోన్ నంబర్కు కానీ, info. blr. nia@gov.in ఈ-మెయిల్కు సమాచారం ఇవ్వాలని కోరింది.