కోల్కతా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెగాసస్ ఫోన్ హ్యాకింగ్ వ్యవహారంపై పశ్చిమబెంగాల్ సర్కారు దర్యాప్తునకు సిద్ధమైంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఇద్దరు రిటైర్డ్ జడ్జిలతోకూడిన దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేశారు. ఇందులో కోల్కతా హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ జ్యోతిర్మయి భట్టాచార్య, సుప్రీం మాజీ జడ్జి మదన్ భీమ్రావు లోకుర్ ఉన్నారు.