కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ 200కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నది. వరుసగా మూడోసారి అధికారాన్ని చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గత ఏడాది చేసిన ట్వీట్ మరోసారి ట్రెండ్ అవుతున్నది.
‘బీజేపీ హైప్ కోసం మద్దతిచ్చే ఒక విభాగం మీడియా ఇది గుర్తుంచుకోవాలి. వాస్తవానికి పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో డబుల్ డిజిట్ను క్రాస్ చేయడం బీజేపీకి కష్టం. అలా చేస్తే వ్యూహకర్తగా పనిచేయను. దయచేసి ఈ ట్వీట్ను సేవ్ చేసుకోండి ’ అని గత ఏడాది డిసెంబర్ 21న ప్రశాంత్ కిషోర్ ట్వీట్ చేశారు.
కాగా, టీఎంసీకి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ జోస్యం నేడు ఫలిస్తున్నది. టీఎంసీ 200కుపైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 80కిపైగా స్థానాల్లో లీడ్లో ఉన్నది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ గతంలో చేసిన ట్వీట్ మరోసారి ట్రెండ్ అవుతున్నది.
For all the hype AMPLIFIED by a section of supportive media, in reality BJP will struggle to CROSS DOUBLE DIGITS in #WestBengal
— Prashant Kishor (@PrashantKishor) December 21, 2020
PS: Please save this tweet and if BJP does any better I must quit this space!