బెంగుళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల(Karnataka Assembly polls) ముందు బీజేపీకి ఆ పార్టీ సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప(KS Eshwarappa) గుడ్బై చెప్పారు. మే 10వ తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్నారు. అభ్యర్థులు ప్రకటించడంలో బీజేపీ(BJP) పార్టీ జాప్యం చేస్తోందని, దాని కారణంగా ఈశ్వరప్ప తన రాజీనామా ప్రకటించినట్లు తెలుస్తోంది. ఎన్నికల రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ఈశ్వర్ప తన లేఖలో తెలిపారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు రాసిన లేఖలో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. గడిచిన 40 ఏళ్లలో పార్టీ తనకు అనేక బాధ్యతలను అప్పగించిందని, బూత్ ఇంచార్జీ నుంచి పార్టీ రాష్ట్ర చీఫ్ వరకు ఎదిగానని, డిప్యూటీ సీఎం కూడా అయినట్లు ఈశ్వర్ప చెప్పారు.