Supreme Court | న్యూఢిల్లీ : ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ ఉద్యోగానికి బీఈడీ డిగ్రీ సరైన అర్హత కాదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. ప్రాథమిక విద్యలో డిప్లొమా ఉండటం ఈ ఉద్యోగానికి సరైన అర్హత అని చెప్పింది. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులుగా బీఈడీ డిగ్రీ హోల్డర్ల నియామకాలను రద్దు చేస్తూ ఛత్తీస్గఢ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఈ ఉద్యోగానికి బీఈడీ హోల్డర్స్ అర్హులని చెప్తూ చేర్చిన నిబంధనను అమలు చేయరాదని స్పష్టం చేసింది. బీఈడీ హోల్డర్స్కు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వడం చట్టవిరుద్ధమని, ఛత్తీస్గఢ్ హైకోర్టు ఈ నియామకాలను రద్దు చేయడం సరైనదేనని వివరించింది.
న్యూఢిల్లీ: దీర్ఘకాలికంగా వాయుకాలుష్యం బారినపడిన పురుషుల్లో సంతాన లేమి వేధిస్తుందని తాజా అధ్యయనం తేల్చింది. 5,26,056 మంది పురుషులపై డెన్మార్క్లోని నార్డ్ యూనివర్సిటీ ఈ అధ్యయనం చేపట్టింది.