న్యూఢిల్లీ, జూలై 25: యాపిల్ స్మార్ట్ వాచీలలో భద్రతాపరమైన సమస్యలను గుర్తించినట్టు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్-ఇన్) తెలిపింది. 8.7 వాచ్ఓఎస్ వెర్షన్ అంతకంటే ఓల్డర్ వెర్షన్లు కలిగిన వాచీలపై సైబర్ దాడులు జరిగే ప్రమాదమున్నదని హెచ్చరించింది. వినియోగదారులు వెంటనే కొత్త వెర్షన్లను అప్డేట్ చేసుకోవాలని సూచించింది.