ముంబై: బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) త్వరలో టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్తో సమావేశం కానుంది. గత ఏడాది నవంబర్లో ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 వరల్డ్కప్లో భారత జట్టు వైఫల్యంపై సమీక్షించడానికే ద్రవిడ్తో బీసీసీఐ సమావేశం కావాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ఆ టోర్నీలో భారత జట్టు సెమీఫైనల్లో ఓటమి ద్వారా ఇంటిముఖం పట్టింది. సెమీఫైనల్లో ఇంగ్లండ్తో తలపడిన టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. గత ఏడాది ఆగస్టు, సెప్టెంబర్లో జరిగిన ఆసియాకప్లో, బంగ్లాదేశ్తో వన్డే సిరీస్లో కూడా టీమిండియా విఫలమైంది. ఈ వైఫల్యాలపై హెడ్ కోచ్తో సమీక్ష చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలిసింది. సమావేశానికి బీసీసీఐ కార్యదర్శి జైషా హాజరుకానున్నట్లు సమాచారం.