కోల్కతా: ఇటీవల కరోనా మహమ్మారి బారినపడ్డ భారత మాజీ క్రికెటర్, బోర్డ్ ఆఫ్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీసీఐ) చీఫ్ సౌరవ్ గంగూలీ కోలుకున్నారు. కొవిడ్-19 ప్రభావం నుంచి బయటపడటంతో ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. నాలుగు రోజుల క్రితం అలసటగా ఉండటంతో గంగూలీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు పాజిటివ్గా తేలింది. దాంతో ఆయన వెంటనే కోల్కతాలోని ఉడ్లాండ్ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు.
నాలుగు రోజులుగా ఆయనకు ట్రీట్మెంట్ చేసిన వైద్యులు ఇవాళ మరోసారి కరోనా పరీక్షలు చేయగా నెగెటివ్ వచ్చింది. దాంతో ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ఈ సందర్భంగా ఉడ్లాండ్ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది బయటిదాకా వచ్చి గంగూలీకి సెండాఫ్ చెప్పారు.