లక్నో, సెప్టెంబర్ 24: యూపీ పదో తరగతి బోర్డు పరీక్షలో టాపర్గా నిలిచిన విద్యార్థికి ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇచ్చిన చెక్కు బౌన్స్ అయ్యింది. దీంతో ఆ విద్యార్థికి జరిమానా పడింది. బారాబంకి జిల్లాలోని యంగ్స్ట్రీమ్ ఇంటర్ కాలేజీకి చెందిన అలోక్ మిశ్రా పదో తరగతి పరీక్షలో 95.5 పర్సంటేజీతో రాష్ట్రస్థాయిలో ఏడో స్థానంలో నిలిచాడు.
మే 29న సీఎం యోగి రూ.లక్ష చెక్కును అందజేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో ఉన్న ఆ చెక్కును రెండు రోజుల తర్వాత తల్లిదండ్రులు బ్యాంకులో జమచేశారు. అయితే, అకౌంట్లోకి డబ్బులు జమ కాలేదు. దీంతో వారు బ్యాంకు అధికారులను సంప్రదించారు. సాక్షాత్తు సీఎం ఇచ్చిన చెక్కు బౌన్స్ అయ్యిందని తెలుసుకొని, అవాక్కయ్యారు. చెక్ బౌన్స్తోపాటు జరిమానాకూడా పడడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు.