కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి అరుదైన గిఫ్ట్ వచ్చింది. బంగ్లాదేశ్ ప్రధాని(Bangladesh PM) షేక్ హసీనా సుమారు 600 కిలోల మామిడి పండ్లను బెంగాల్ సీఎంకు పంపారు. హిమసాగర్, లంగ్రా రకాలకు చెందిన మామిడి పండ్లను హసీనా గిఫ్ట్గా పంపారు. దౌత్యపరమైన సంబంధాల్లో భాగంగా ఈ గిఫ్ట్ను అందజేశారు. గత ఏడాది కూడా మామిడి పండ్లను పంపినట్లు బంగ్లాదేశ్ డిప్యూటీ హై కమిషన్ అధికారి తెలిపారు. బెంగాల్ సీఎంతో పాటు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులకు కూడా హసీనా మామిడి పంట్లను పంపించారు. గత ఏడాది ప్రధాని మోదీకి కూడా హసీనా పండ్లను గిఫ్ట్గా అందజేశారు.