Bangalore Rave Party | బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ వచ్చిన వారిని బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. సినీ నటి హేమ, ఆషురాయ్ సహా 86 మందికి నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే రేవ్ పార్టీ జరిగిన జీఆర్ ఫామ్హౌస్ యజమాని గోపాల్రెడ్డికి కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో ఏ6గా ఉన్న గోపాల్ రెడ్డిని విచారణ అధికారి ఎదుట హాజరుకావాలని సీసీబీ నోటీసులు జారీ చేసింది.
కాగా, రేవ్ పార్టీ కేసుకు సంబంధించి విచారణలో భాగంగా ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి కారు స్టిక్కర్ ఎవరు వాడారనే దానిపై కూడా పోలీసులు దృష్టిసారించారు. ఈ క్రమంలోనే పూర్ణారెడ్డి అనే వ్యక్తి కాకాణి కారు స్టిక్కర్ వాడినట్లు పోలీసులు గుర్తించారు. రేవ్ పార్టీపై పోలీసుల దాడి సమయంలో ఫామ్హౌస్ నుంచి పూర్ణారెడ్డి పరారైనట్లు గుర్తించారు. నిన్న సాయంత్రం బెంగళూరు సీసీబీ పోలీసులు పూర్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.