బాలానగర్, జూన్ 6: బెంగళూరు ఎక్స్ప్రెస్కు మంగళవారం రాత్రి పెను ప్రమాదం తప్పింది. కాచిగూడ నుంచి బెంగళూరుకు బయలుదేరిన రైలు.. మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ రైల్వేస్టేషన్ వద్ద సడెన్బ్రేక్ వేయడంతో వీల్స్లో మంటలు చెలరేగాయి. రైల్వేసిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలను ఆర్పివేయడం తో ప్రమాదం తప్పింది.
ఒడిశా ఘటనను మరువకముందే బెంగళూరు ఎక్స్ప్రెస్ రైలు చక్రాల్లో మంటలు రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. 15 నిమిషాల తర్వాత ఆ రైలు బెంగళూరుకు బయలుదేరింది.