న్యూఢిల్లీ, జనవరి 13: గోధుమ, బియ్యం, చక్కెర ఎగుమతులపై అమలవుతున్న ఆంక్షలను ఎత్తివేసే ప్రతిపాదనేదీ ప్రస్తుతానికి తమ వద్ద లేదని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. అలాగే గోధుమలు, పంచదారలను దిగుమతి చేసుకునే ప్రణాళిక గాని, అవసరం గాని దేశానికి లేదని తెలిపారు. 2022 మే నెలలో గోధుమ ఎగుమతులపై భారత్ నిషేధం విధించింది. బాస్మతేతర బియ్యం ఎగుమతులను గత ఏడాది జూలై నుంచి నిషేధించడమే కాక పంచదార ఎగుమతులపై ఆంక్షలను గత ఏడాది అక్టోబర్ తర్వాత పొడిగించింది. అయితే ఆహార భద్రతను ఎదుర్కొంటున్న ఇండోనేషియా, గాంబి యా, సెనెగల్ లాంటి మిత్రదేశాలకు మాత్రం బియ్యాన్ని పంపిస్తున్నామని చెప్పారు.