న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: ఆన్లైన్ గేమ్స్ కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను గురువారం విడుదల చేసింది. బెట్టింగ్లపై నిషేధం విధించింది. ఇందుకోసం బహుళ స్వీయ నియంత్రణ సంస్థల ఫ్రేమ్వర్క్ (ఎస్ఆర్వోలు)ను రూపొందించింది. ఇకనుంచి ఆన్లైన్లో బెట్టింగ్లు, పందేలు ఆడటం కొత్త నిబంధనలకు విరుద్ధమని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. వీటిని గుర్తించేందుకు ఎస్ఆర్వో ఫ్రేమ్వర్క్ను ఏర్పాటు చేశామని చెప్పారు. బెట్టింగ్లు, పందేలకు సంబంధించిన ఆన్లైన్ గేమ్స్కు అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేశారు.