ముంబై: బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్కు క్రూయిజ్ షిష్ డ్రగ్స్ కేసులో బెయిల్ మంజూరైంది. దాదాపు 25 రోజులపాటు జైల్లో ఉన్న ఆర్యన్ఖాన్కు ఇవాళ బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆర్యన్తోపాటు మరో ఇద్దరు నిందితులు అర్బాజ్ మర్చంట్, మున్మున్ దమేచాలకు కూడా బెయిల్ లభించింది. అక్టోబర్ 2న ముంబై తీరంలో క్రూయిజ్ షిష్లో డ్రగ్స్ సేవిస్తూ ఆర్యన్ఖాన్ నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకు పట్టుబడ్డాడు.
కేసులో ఎన్సీబీ అధికారుల విచారణ పూర్తయిన అనంతరం ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ వేశాడు. ముందుగా రెండు కింది కోర్టులు ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్లను ఆయన బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. గత మంగళవారం ఆర్యన్ బెయిల్ పిటిషన్ను విచారణకు తీసుకున్న బాంబే హైకోర్టు తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. బుధవారం కూడా తదుపరి విచారణను గురువారానికి (ఇవాళ్టికి) వాయిదా వేసింది.
ఇవాళ విచారణ పూర్తి చేసి ఆర్యన్కు బెయిల్ మంజూరు చేసింది. ఆర్యన్ ఖాన్ తరఫున భారత మాజీ అటార్ని జనరల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. కాగా, ఆర్యన్ ఖాన్ను రేపు జైలు నుంచి విడుదల చేసే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు.