న్యూఢిల్లీ, జూలై 18: లైంగిక వేధింపుల కేసులో భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్భూషణ్కు ఢిల్లీ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ మంగళవారం రెండు రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. ఇందుకోసం రూ.25 వేల వ్యక్తిగత పూచీకత్తు బాండ్ సమర్పించాలని ఆదేశించారు. మహిళా రెజ్లర్లు చేసిన ఈ లైంగిక వేధింపుల ఆరోపణల కేసుల్లో సమాఖ్య అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ తోమర్కు కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బ్రిజ్కు వ్యతిరేకంగా మీడియా ట్రయల్ నడుస్తున్నదని ఆ యన తరపు న్యాయవాది ఆరోపించారు. దీనిపై తగిన ఆదేశాల కోసం ఇదే కోర్టులో లేదా హైకోర్టులో దరఖాస్తు చేసుకోవచ్చని న్యాయమూర్తి సూచించారు.