డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ ధామ్ను మే 12న తెరవనున్నట్లు బద్రీనాథ్-కేదార్నాథ్ దేవాలయాల కమిటీ చైర్మన్ అజేంద్ర అజయ్ బుధవారం తెలిపారు. మే 12న ఉదయం 6 గంటల నుంచి భక్తులను అనుమతించనున్నట్లు చెప్పారు. వసంత పంచమి సందర్భంగా నరేంద్ర నగర్ ప్యాలెస్లో ప్రత్యేక పూజల అనంతరం ఈ ప్రకటన చేశారు. ఈ ఏడాది చార్ధామ్ యాత్రలో పాల్గొనే భక్తుల కోసం ఏర్పాట్లను త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు.