న్యూఢిల్లీ, అక్టోబర్ 4: ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీదేవి, కుమారుడు, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్కు బుధవారం బెయిల్ మంజూరు అయ్యింది. సీబీఐ సమన్లతో ప్రత్యేక కోర్టు ముందు హాజరైన నిందితులు ఒక్కొక్కరు 50 వేల విలువైన బాండ్ను సమర్పించాలని ప్రత్యేక జడ్జి గీతాంజలి గోయర్ ఆదేశిస్తూ బెయిల్ మంజూరు చేశారు.
వీరి బెయిల్కు సీబీఐ ఎలాంటి అభ్యంతరం తెలియజేయలేదు. రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో లాలూ, ఆయన కుటుంబ సభ్యులు భూమి ఇస్తే ఉద్యోగాలిప్పిస్తామని పలువురు నిరుద్యోగులను మోసం చేశారన్న ఆరోపణలపై సీబీఐ వీరిపై కేసు దాఖలు చేసింది.