న్యూఢిల్లీ : పెంపుడు కుక్కలు, పిల్లుల వంటివే కాకుండా ఏనుగులు వంటి ఇతర జంతువులు సైతం తమ సంరక్షకులతో సన్నిహిత బంధం పెంచుకుంటాయి. మనుషులతో జంతువుల బాండింగ్ తెలిపే ఓ ఫోటో నెట్టింట ఇప్పుడు పలువురిని ఆకట్టుకుంటోంది. చిన్న ఏనుగు ఓ వ్యక్తిని కౌగిలించుకున్న ఫోటోను అటవీ అధికారి సుశాంత నంద సోమవారం ట్విటర్ లో షేర్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
జంతువులు తమ సంరక్షకులతో నెరిపే బేషరతు ప్రేమకు ఐఎఫ్ఎస్ అధికారి నందా షేర్ చేసిన ఫొటో చిహ్నమని నెటిజన్లు కామెంట్ చేశారు. ఈ ఫోటోకు మనకు వీరిద్దరూ కావాలి అని ఐఎఫ్ఎస్ అధికారి క్యాప్షన్ ఇచ్చారు. బేబీ ఎలిఫెంట్ హగ్ చేస్తుండగా వ్యక్తి ఆవరణను శుభ్రం చేస్తున్న ఈ ఫోటో ఆన్లైన్ లోపోస్ట్ అయిన కొద్ది సేపటికే వేలాది లైక్ లు రాగా, వందల్లో రీట్వీట్లు వచ్చాయి.