ఇటీవల కేంద్ర క్యాబినెట్ నుంచి తొలగింపు
కోల్కతా, జూలై 31: కేంద్ర మాజీ మంత్రి, పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత బాబుల్ సుప్రియో రాజకీయాలకు గుడ్బై చెప్పారు. ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తానని తెలిపారు. మంత్రి పదవిని కోల్పోవడంతో పాటు బీజేపీ నాయకత్వంతో విభేదాలే తన నిర్ణయానికి కొంతవరకు కారణమని చెప్పారు. 2014 నుంచి మోదీ ప్రభుత్వంలో పలు శాఖల సహాయ మంత్రిగా సుప్రియో పనిచేశారు. ఇటీవల మంత్రివర్గ విస్తరణ సందర్భంగా సుప్రియోను మోదీ తొలగించారు. ఆయనతో పాటు దేబశ్రీ చౌధురికి కూడా ఉద్వాసన పలికారు. బెంగాల్కు చెందిన మరో నలుగురు బీజేపీ ఎంపీలకు సహాయమంత్రి పదవులు ఇచ్చారు. తనను ఏ పార్టీ పిలువలేదని, పిలిచినా చేరబోనని స్పష్టం చేశారు. అసన్సోల్ నుంచి సుప్రియో రెండుసార్లు ఎంపీగా గెలిచారు. సుప్రియో వైదొలగడంపై వ్యాఖ్యానించడానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ఘోష్ నిరాకరించారు.