రాంపూర్: నకిలీ జన్మ ధ్రువీకరణ పత్రం కేసులో సమాజ్వాద్ పార్టీ నేత, మాజీ ఎంపీ ఆజంఖాన్, అతని భార్య తజీన్ ఫాతిమా, కుమారుడు, మాజీ ఎంఎల్ఏ అబ్దుల్లా ఆజమ్లకు ఎంపీ-ఎంఎల్ఏ కోర్టు బుధవారం ఏడేండ్ల కారాగార శిక్ష విధించింది.
నిందితులను అదుపులోకి తీసుకుని జైలుకు తరలించనున్నట్టు అధికారులు తెలిపారు. ఆజం ఖాన్, అతని భార్య తమ కుమారుడి పేర ఒకటి లక్నోలో, మరొకటి రాంపూర్లో నకిలీ బర్త్ సర్టిఫికెట్లు పొందడానికి సహకరించారంటూ బీజేపే ఎంఎల్ఏ ఆకాశ్ సక్సేనా గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు.