Azam Khan | ద్వేషపూరిత ప్రసంగం కేసులో ఎస్పీ నేత అజాంఖాన్ను కోర్టు దోషిగా తేల్చింది. కోర్టు అజాంఖాన్కు రెండేళ్ల జైలుశిక్ష, రూ.2500 జరిమానా విధించింది. శిక్షపై అజాంఖాన్ తరపు న్యాయవాది, ప్రాసిక్యూషన్ తరఫు వాదనలు వినిపించారు. ఏప్రిల్ 18, 2019న ధమర గ్రామంలో జరిగిన బహిరంగ సభలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ తర్వాత ఏడీఓ కో ఆపరేటివ్ అనిల్ చౌహాన్ షాజాద్నగర్లో అజాంఖాన్పై కేసు పెట్టారు. చర్చల తర్వాత, పోలీసులు కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. విచారణ అనంతరం శనివారం ద్వేషపూరిత ప్రసంగం కేసులో అజాంఖాన్ను కోర్టు దోషిగా గుర్తించింది. అజాంఖాన్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు.. తీర్పును వెలువరించింది. అయితే, పై కోర్టులో పిటిషన్కు సంబంధించి బెయిల్ మంజూరైంది.