న్యూఢిల్లీ: గులాం నబీ ఆజాద్.. గులాంలా కాకుండా ఆజాద్గా ఉండాలనుకుంటున్నాడని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ అన్నారు. జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గులాంనబీ ఆజాద్కు కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డు ప్రకటించింది. దీనిపై జైరాం రమేష్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్యా పద్మభూషణ్ అవార్డును తిరస్కరించారనే వార్తలను షేర్ చేసిన ఆయన.. ‘గులాంనబీ ఆజాద్కు పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం సరైనదే. అతను గులాం కాకుండా ఆజాద్గా ఉండాలనుకుంటున్నాడు’ అని ట్విటర్లో పోస్టు చేశారు.