న్యూఢిల్లీ: అయోధ్యలో రామాలయాన్ని(Ayodhya Ram Temple) సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. అద్భుతకమైన కళాకృతులతో ఆలయ నిర్మాణం సాగుతోంది. జనవరి 22వ తేదీన ఆ ఆలయంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట జరగనున్నది. అయితే ఈ ఆలయ నిర్మాణం కోసం 392 పిల్లర్లు వాడినట్లు రామజన్మభూమి ట్రస్టు జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ తెలిపారు. 14 ఫీట్ల వెడల్పుతో పెర్కోటాను తీర్చిదిద్దారు. సుమారు 732 మీటర్ల ఉంటుంది. రామాలయం కాంప్లెక్స్లో దాదాపు 70 శాతం ఏరియా గ్రీన్గా ఉంటుందన్నారు.
Ayodhya’s Ram temple will have 392 pillars, 14 ft-wide ‘percota’ periphery to span 732 metres: Temple trust general secretary Champat Rai
— Press Trust of India (@PTI_News) December 26, 2023
ఆత్మనిర్భర్ కాన్సెప్ట్తో ఆలయాన్ని నిర్మిస్తున్నట్లు ఆయన చెప్పారు. సీవేజ్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఉంటాయన్నారు. వృద్ధులు, దివ్యాంగులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండే రీతిలో ఆలయ ప్రవేశం ఉంటుందన్నారు. రామాలయం కాంప్లెక్స్కు చెందిన ల్యాండ్స్కేప్ ప్లాన్ను ఆయన ట్రస్టు సభ్యులతో ఇవాళ షేర్ చేశారు. 70 ఎకరాలు ఉన్న ఆలయంలోని 70 శాతం ప్రాంతం పచ్చికతో నిండి ఉంటుందన్నారు.
ఫైర్ బ్రిగేడ్ పోస్టు కూడా ఆలయంలో ఉంటుందన్నారు. అగ్నిమాపక సిబ్బంది అండర్ గ్రౌండ్ రిజర్వాయర్ ద్వారా తమకు కావాల్సిన నీరును తీసుకుంటుందని చంపత్ రాయ్ తెలిపారు. వృద్ధులు, దివ్యాంగుల గురించి టెంపుల్ కాంప్లెక్స్లో లిఫ్ట్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎంట్రెన్స్ వద్ద రెండు ర్యాంప్లను కూడా సిద్ధం చేస్తున్నారు. అయోధ్యలోని కుబేర్ తిల ప్రాంతంలో జఠాయువు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు చంపత్ రాయ్ చెప్పారు.