భోపాల్: మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్(CM Mohan Yadav) కీలక వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం.. అఖండ భారత్ ఏర్పాటు దిశగా ముందడుగు అని, అవిభాజ్య భారత్ను పునర్ సృష్టించడమే తమ లక్ష్యమన్నారు. ఒకవేళ ఆ దేవుడు ఆశిస్తే.. ఆఫ్ఘనిస్తాన్ వరకు అఖండ భారత్ వ్యాపిస్తుందన్నారు. భోపాల్లో జరిగిన హనుమాన్ చాలీసా ఈవెంట్లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అయోధ్యా రామాలయ నిర్మాణం.. అఖండ భారత్ దిశగా అడుగులు వేస్తుందన్నారు. 1992 తర్వాత జరిగిన పరిణామాల వల్ల ప్రస్తుతం ఆలయం నిర్మించే సౌభాగ్యం దక్కిందని, గడిచిన 500 ఏండ్ల నుంచి ఎన్నో తరాలు ఈ ఆలయ నిర్మాణం కోసం పోరాటం చేసినట్లు సీఎం మోహన్ యాదవ్ తెలిపారు. ప్రస్తుతం ఆలయం ఉన్న చోట విక్రమాదిత్య మహారాజు రాముడికి ఆలయాన్ని కట్టించారన్నారు.
అయితే ఆ ఆలయం శత్రు రాజుల కండ్లల్లో మెదిలేదని, పరాయి పాలన సమయంలో ఆ ఆలయాన్ని ధ్వంసం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇదే రీతిలో సింద్, పంజాబ్ను విభజించారని, 1947లో కూడా పాకిస్థాన్ విభజన జరిగిందని సీఎం తెలిపారు. ఒకవేళ దేవుడు కోరుకుంటే అఖండ భారత్ ఏర్పాటు సాధ్యమే అని, ఇవాళ కాకపోతే, రేపైనా తప్పదన్నారు. సింద్, పంజాబ్, ఆఫ్ఘనిస్తాన్ ఒక్కటికావాలన్నారు. నాన్కానా సాహిబ్ నిజం కావాలని ఆయన ఆశించారు.
राममय मध्यप्रदेश…🚩
आज ‘हेमू कालानी स्टेडियम’ दशहरा मैदान, संत हिरदाराम नगर, बैरागढ़ में 11 हजार रामभक्तों के साथ श्री हनुमान चालीसा पाठ करने का शुभ अवसर प्राप्त हुआ।
अब कुछ ही समय पश्चात, हमारे आराध्य प्रभु श्री राम अपने मंदिर में विराजमान होंगे।
इस अवसर पर उपमुख्यमंत्री… pic.twitter.com/wqcutTOexv
— Dr Mohan Yadav (@DrMohanYadav51) January 20, 2024