హైదరాబాద్ సిటీబ్యూరో(నమస్తే తెలంగాణ): బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అదే రోజు అదే ముహూర్తానికి హైదరాబాద్తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పండంటి బిడ్డకు జన్మనిచ్చేందుకు కొందరు గర్భిణులు సిద్ధమయ్యారు.
22న తమకు పురుడు పోయాలని డాక్టర్లను కోరుతున్నారు. సోమవారం మధ్యాహ్నం 12.20 నిమిషాలకు డెలివరీ జరగాలని ఓ జంట సికింద్రాబాద్లోని కిమ్స్ కడల్స్లో అడ్మిషన్ తీసుకుంది.