న్యూఢిల్లీ, జనవరి 20: అమాయక ముస్లింలను చంపిన తర్వాత అయోధ్యలో రామ మందిరాన్ని ప్రారంభించుకొంటున్నారంటూ పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు గురుపత్వంత్ సింగ్ పన్నూకు చెందిన నిషేధిత ఉగ్ర సంస్థ ఎస్ఎఫ్జేతో సంబంధాలు ఉన్న ముగ్గురు వ్యక్తులను ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్వాడ్ అయోధ్యలో అరెస్టు చేసింది.
ఆయోధ్యలో విధ్వంసం సృష్టిస్తామని సిక్కు వేర్పాటువాది పన్నూ హెచ్చరించడంతో నిందితులు పన్నూ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్టు తెలిసిందని తెలిపాయి. ఈ నేపథ్యంలో అయోధ్యలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం అయోధ్యలో పరిస్థితి నియంత్రణలో ఉన్నదని, అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకొన్నట్టు నిఘా వర్గాలు వెల్లడించాయి.