న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్పై నెలకొన్న అనుమానాలు, భయాందోళనలను వీడాలని ప్రధాని మోదీ దేశ ప్రజలను కోరారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ.. ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని సూచించారు. తాను మాత్రమేగాక 100 ఏళ్ల వయసున్న తన తల్లి సైతం రెండు డోసుల టీకా తీసుకున్నదని ప్రధాని వెల్లడించారు.
‘మీ అకందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. శాస్త్ర విజ్ఞానాన్ని నమ్మండి. శాస్త్రవేత్తలను విశ్వసించండి. ఇప్పటికే అనేక మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. నేను రెండు డోసులు వేయించుకున్నా. 100 ఏళ్ల వయసున్న మా అమ్మ కూడా రెండు డోసుల టీకా తీసుకున్నారు. టీకాలపై వస్తున్న వదంతులను నమ్మవద్దు’ అని మన్ కీ బాత్ సందర్భంగా దేశ ప్రజలను మోదీ కోరారు.
కేవలం వ్యాక్సిన్ ద్వారా మాత్రమే మహమ్మారి నుంచి తప్పించుకోగలమని మోదీ పేర్కొన్నారు. వదంతులు వ్యాప్తి చేసే వారిని పట్టించుకోవద్దని చెప్పారు. మన చుట్టూ ఉన్న ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సాహించాలని పిలుపునిచ్చారు. మహమ్మారి ముప్పు ఇంకా పొంచి ఉన్న నేపథ్యంలో వ్యాక్సిన్తో పాటు కరోనా కట్టడి నిబంధనలను పాటించాలని కోరారు.