న్యూఢిల్లీ : వారం రోజులుగా వరద పోటుతో ఉక్కిరిబిక్కిరైన దేశ రాజధాని ఢిల్లీ (Delhi Floods) ఇప్పుడిప్పుడే కుదురుకుంటోంది. యమునా నదిలో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టినా ఇప్పటికీ ప్రమాద స్ధాయిని మించి ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇంకా పునరవాస శిబిరాల్లోనే తలదాచుకుంటున్నారు.
వేలాది మంది నిరాశ్రయులు కాగా వందలాది ఇండ్లు నీటమునిగాయి. వరదలతో పోటెత్తిన యమునా నది వద్ద సెల్పీలు దిగడం, రీల్స్ చేయడం వంటివి ప్రమాదకరమని మంత్రి సౌరబ్ భరద్వాజ్ ప్రజలను హెచ్చరించారు. ఇలాంటి ఫీట్లు ప్రాణాలకే ప్రమాదమని, వరద ముప్పు ఇంకా తొలగిపోలేదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అసాధారణ వర్షాలతో ఢిల్లీని వరదలు ముంచెత్తినా రాష్ట్ర ప్రభుత్వం శక్తి మేర పనిచేసిందని చెప్పారు. ఇక వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలు తగ్గుముఖం పట్టినా వరద ఉధృతి కొనసాగుతోంది. పలు రోడ్లు, ఇండ్లు, వాణిజ్య సంస్ధల వద్ద మోకాలు లోతున నీరు నిలిచిఉంది. ట్రాఫిక్ ఇబ్బందులతో వాహనదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం నెలకొంది.
Read More :