డెహ్రాడూన్: హిమాలయాల్లోని కేదార్నాథ్ జ్యోతిర్లింగ క్షేత్రం వద్ద ఇవాళ ఉదయం భారీగా మంచుచరియలు విరిగిపడ్డాయి. కేదార్నాథ్ ఆలయం వెనుక భాగంలో సుదూరంలో ఉన్న కొండచరియలు ఒక్కసారిగా కూలాయి. దీంతో ఆ ప్రాంతంలో భారీగా మంచు కొట్టుకువచ్చింది. అయితే ఆలయానికి ఎటువంటి ప్రమాదం జరగలేదని శ్రీ బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ అధ్యక్షుడు అజేంద్ర అజయ్ తెలిపారు. చూస్తుండగానే ఒక్కసారిగా మంచు శిఖరం నేలకు ఒరిగింది. భారీ మొత్తంలో మంచు కొండల మధ్య వ్యాపించింది. దీనికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు.
#WATCH | Uttarakhand: An avalanche occurred this morning in the Himalayan region but no damage was sustained to the Kedarnath temple: Shri Badrinath-Kedarnath Temple Committee President, Ajendra Ajay pic.twitter.com/fyi2WofTqZ
— ANI UP/Uttarakhand (@ANINewsUP) October 1, 2022
గత కొన్ని రోజుల నుంచి చార్ధామ్ యాత్ర రూట్లో భారీ వర్షాలు పడుతున్నాయి. సెప్టెంబర్ 21వ తేదీన కేదార్నాథ్ రూట్లో ఉన్న కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదు. కానీ యాత్రికులు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.