లక్నో : ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. పలు చోట్ల గుంతలు ఏర్పడ్డాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. గుంతల రోడ్డులో వెళ్తున్న ప్రభుత్వ అధికారులు కాన్వాయ్ ముందే.. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఆటో బోల్తా పడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్లో చోటు చేసుకుంది.
ఆటో బోల్తా పడటాన్ని అధికారులు గమనించినప్పటికీ, కనీసం తమ కాన్వాయ్ను ఆపలేదు. అలాగే ముందకు పోనిచ్చారు. స్థానికులే ఆటో దగ్గరకు వచ్చి.. డ్రైవర్కు, ప్రయాణికులకు సహాయం చేశారు. రోడ్లపై గుంతలు ఏర్పడినప్పటికీ, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల మరమ్మతులు తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎడతెరిపి లేని వర్షాలతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. వర్షాల కారణంగా ఇప్పటి వరకు పలు ప్రాంతాల్లో 11 మంది మృతి చెందినట్లు అక్కడి అధికారులు తెలిపారు. లక్నో, నోయిడా, కాన్పూర్, ఆగ్రా, ఫిరోజాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో 17 జిల్లాలోని 900 గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి. భారీ వర్షాల కారణంగా పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం నేడు సెలవు ప్రకటించింది.
Watch this Deja Vu video (Ballia)
An e-rickshaw turned turtle in huge potholes ridden road at Jahagirbad Kasba of #Sitapur district while a convoy of govt officers including DM was passing by. #UttarPradesh pic.twitter.com/YXx4twaDOm
— Arvind Chauhan (@Arv_Ind_Chauhan) October 10, 2022