న్యూఢిల్లీ : నోయిడాలోని సూపర్టెక్ ట్విన్ టవర్స్ కూల్చివేతతో 80,000 టన్నుల ఘన వ్యర్ధాలు పేరుకుపోతాయని నోయిడా సీఈవో రితు మహేశ్వరి చెప్పారు. 50,000 టన్నుల వ్యర్దాలను సైట్లో ఉంచి మిగిలిన 30,000 టన్నులను సెక్టార్-80లోని నిర్మాణ, డిమాలిషన్ మేనేజ్మెంట్ ప్లాంట్కు తరలించి శాస్త్రీయంగా ధ్వంసం చేస్తామని చెప్పారు.
వ్యర్ధాల్లో ఎక్కువభాగం బిల్డింగ్ బేస్మెంట్స్ ఫిల్ చేసేందుకు ఉపయోగిస్తామని తెలిపారు. వ్యర్ధాల తొలగింపు వేగంగా చేపడతామని ఆమె వెల్లడించారు. మొత్తం వ్యర్ధాల్లో 4000 టన్నులు ఇనుము, టీఎంటీ బార్లు, భవన నిర్మాణానికి వాడిన ఇతర ఇనుము పరికరాలు ఉంటాయని అన్నారు. ఇనుప వ్యర్ధాలను డిమాలిషన్ మేనేజ్మెంట్ కంపెనీ ఎడిఫైస్ వేరుచేసి తర్వాత వాటిని విక్రయిస్తారని తెలిపారు.
సైట్ నుంచి వ్యర్ధాల తొలగింపునకు మూడు నెలల సమయం పడుతుందని చెప్పారు. 32,29 అంతస్తుల ట్విన్ టవర్స్ కూల్చివేతకు 3700 కిలోల పీఈటీఎన్ పేలుడుపదార్ధాలను వాడతారని డిమాలిషన్ మేనేజ్మెంట్ బృందం తెలిపింది. ఇక ఆదివారం మధ్యాహ్నం 2.30కు ట్విన్ టవర్స్ కూల్చివేయనున్నారు.