Ayodhya case | ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్పై జారీ చేయనున్నది. అయోధ్యలో ఉగ్రదాడి కోసం రాజస్థాన్ గ్యాంగ్తో రెక్కీ నిర్వహించేందుకు ప్రయత్నించగా.. ఉగ్రవాదికి వ్యతిరేకంగా యూపీ ఏటీఎస్ బలమైన సాక్ష్యాలను సేకరిస్తున్నది. లుక్ అవుట్ సర్కుల్యర్ జారీ చేసేందుకు పంజాబ్ పోలీసులతో పాటు కేంద్ర నిఘా సంస్థల సహాయాన్ని ఏటీఎస్ తీసుకుంటున్నది. కెనడాలో ఆశ్రయం పొందుతున్న ఉగ్రవాది భారత్కు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.
సీఎం ఆదిత్యనాథ్తో పాటు, రామ మందిరంపై విషయంలో పలుసార్లు బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇదిలాఉండగా పన్నుపై యూపీలో ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు కాలేదు. తొలిసారిగా కేసు అయోధ్యలో దాడికి కుట్ర పన్నిన కేసులో ఉగ్రవాది పేరును సైతం చేర్చారు. ఇటీవల పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, డీజీపీ గౌరవ్ యాదవ్లను సైతం చంపేస్తామని పన్ను బెదిరింపులకు పాల్పడ్డాడు. పంజాబ్లో అతనిపై 22 కేసులు నమోదయ్యాయి.
అయోధ్యలో దాడికి కుట్ర పన్నిన కేసులో పన్నును చట్టపరిధిలోకి తీసుకురావాలని ఏటీఎస్ ప్రయత్నిస్తోంది. ఇందు కోసం అయోధ్యలో అరెస్టు చేసిన గ్యాంగ్స్టర్ శంకర్ లాల్ దుసాద్ ద్వారా ఓ బృందం పన్ను అనుచరులు, సన్నిహితుల కోసం గాలిస్తున్నారు. ముఖ్యమైన సాక్ష్యాలను సేకరించేందుకు ఏటీఎస్ సోమవారం రాత్రి దుసాద్ను రాజస్థాన్ మరియు హర్యానాకు తీసుకెళ్లనున్నది. దాంతో పన్నుపై బలమైన కేసును సిద్ధం చేయచ్చని భావిస్తున్నట్లు సమాచారం. గత సెప్టెంబర్లో చండీగఢ్లోని పన్నూ ఇంటిని ఎన్ఐఏ సీజ్ చేసిన విషయం తెలిసిందే.