బీజాపూర్: ఛత్తీస్గఢ్లోని నక్సల్స్ ప్రాబల్యంగల బీజాపూర్లో ఆదివారం దారుణం జరిగింది. కుట్రు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో సంత జరుగుతుండగా, ఛత్తీస్గఢ్ ఆర్మ్డ్ ఫోర్స్ (సీఏఎఫ్) బృందం భద్రతా విధులను నిర్వహిస్తున్నది.
నక్సలైట్లు ఉదయం 9.30 గంటల ప్రాంతంలో సీఏఎఫ్ కమాండర్ తిజావు రామ్ భువరియాపై గొడ్డలితో దాడి చేశారు. ఈ దాడిలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసు బృందం సంఘటన స్థలానికి చేరుకుని, దర్యాప్తు ప్రారంభించింది.