న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్రం ఎలక్టోరల్ బాండ్ల అమ్మకానికి సిద్ధమైంది. బాండ్ల అమ్మకానికి శుక్రవారం ఆమోదం తెలిపింది. 26వ విడత కింద ఏప్రిల్ 3 నుంచి 12వ తేదీ వరకు బాండ్లను విక్రయించనున్నట్టు ఆర్థిక శాఖ వెల్లడించింది.
దేశవ్యాప్తంగా 29 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచుల్లో ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేయవచ్చునని తెలిపింది. రాజకీయ పార్టీలకు విరాళాలు సమకూర్చే ఈ ఎలక్టోరల్ బాండ్ల వ్యవస్థ 2018లో ప్రారంభమైంది. ఆ ఏడాది మార్చి 1-10 తేదీల మధ్య తొలి విడుత ఎలక్టోరల్ బాండ్ల అమ్మకం చేపట్టారు.