PM Modi : భారతదేశంలో 90 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) చెప్పారు. 2024 లోక్సభ ఎన్నికల్లో మొత్తం 64 కోట్ల మంది ఓటు వేశారని.. యూరప్ దేశాల (Europe Countries) జనాభా మొత్తం కలిపినా 64 కోట్ల మంది కూడా లేరని వ్యాఖ్యానించారు. నెదర్లాండ్స్ (Nedarlands) పర్యటనలో ఉన్న ఆయన హేగ్ నగరంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధానికి అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలతో ఘనస్వాగతం లభించింది. ప్రవాస భారతీయులతో కరచాలనం, మాటామంతీ నిర్వహించారు.
నెదర్లాండ్స్ నాయకత్వంతో ఎప్పుడు మాట్లాడినా ప్రవాస భారతీయులను ఎంతో ప్రశంసించేవారని ఈ సందర్భంగా ప్రధాని గుర్తు చేసుకున్నారు. హేగ్ నగరం భారతీయ స్నేహానికి సజీవ చిహ్నంగా మారిందన్నారు. కాలం మారినా భారతీయ సంస్కృతి మారలేదని కొనియాడారు. ఈ సందర్భంగా ఈయూ దేశాలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘డిజిటల్ చెల్లింపుల్లో భారత్ అగ్రస్థానంలో ఉన్నదని, నెలకు 20 బిలియన్ డాలర్ల విలువైన డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయని చెప్పారు.
భారత్లో ఒకప్పుడు కేవలం 4 యూనికార్న్ సంస్థలే ఉండేవని, ఇప్పుడు ఆ సంఖ్య 100 దాటిందని తెలిపారు. సెమీకండక్టర్ల విషయంలో భారత్ కీలక ముందడుగు వేసిందని అన్నారు. భారత్లో సెమీ కండక్టర్ ప్లాంట్ల పనులు జరుగుతున్నాయని చెప్పారు. మేడిన్ ఇండియా చిప్లు తయారవుతున్నాయని, ఏఐ సమ్మిట్, జీ20 సమావేశాలను విజయవంతంగా నిర్వహించగలిగామని ప్రధాని గుర్తుచేశారు.